యోగదా సత్సంగ ఆశ్రమం, దక్షిణేశ్వర్

గంగానదికి సమీపంలో ఉన్న దక్షిణేశ్వర్ (కోల్‌కతా) ఆశ్రమం

21, యు.ఎన్. ముఖర్జీ రోడ్, దక్షిణేశ్వర్, కోల్‌కతా – 700 076.
టెలిఫోన్: +91 (33) 2564 5931, +91 (33) 2564 6208, +91 8420873743, +91 9073581656
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క రిజిస్టర్డ్ కార్యాలయం.
ఇ-మెయిల్: yssdak@yssi.org

వెబ్‌సైట్ లింక్: dakshineswar.yssashram.org

పరమహంస యోగానందగారు 1935-36లో భారతదేశ పర్యటన సందర్భంగా కలకత్తా నుండి రాజర్షి జనకానందకు ఇలా వ్రాశారు, “బెంగాల్ కిరీట నగరమైన కలకత్తాలో శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి నేను నిరంతరం కృషి చేస్తున్నానని తెలిస్తే నువ్వు సంతోషిస్తావు. మరియు దాదాపు విజయవంతమైందని నేను అనుకుంటున్నాను.” (రాజర్షి జనకానంద – ఎ గ్రేట్ వెస్ట్రన్ యోగి). తరువాత, ఆయన ఒక యోగి ఆత్మకథలో ఇలా వ్రాశారు, “గంగానదికి ఎదురుగా ఉన్న దక్షిణేశ్వర్‌లో ఒక గొప్ప యోగదా మఠం 1939లో అంకితం చేయబడింది. కలకత్తాకు ఉత్తరాన కొన్ని మైళ్ల దూరంలో మాత్రమే, ఆశ్రమం ఉండడం నగరవాసులకు శాంతి స్వర్గంగా తోడ్పడుతుంది. దక్షిణేశ్వర్ మఠం భారతదేశంలోని యోగదా సత్సంగ సొసైటీ మరియు దాని పాఠశాలలు, కేంద్రాలు మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమాలకు ప్రధాన కార్యాలయంగా ఉంటుంది.

మఠం ఒకప్పుడు ఒక ‘గార్డెన్ హౌస్’, రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరణతో పని ప్రదేశాలుగా మార్చబడిన అశ్వశాల కలిగి ఉన్నది. ఇప్పటికీ నిర్వహించబడుతున్న ఒక కొలను ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, మన దివ్య గురుదేవులు ఊహించిన విధంగా, భారతదేశం మరియు విదేశాల నుండి సందర్శన కోసం వచ్చే భక్తుల సౌలభ్యం కోసం అతిథి గృహం, వంటగది మరియు భోజన ప్రాంతాలు జోడించబడ్డాయి.

దక్షిణేశ్వర్ కోల్‌కతా (కలకత్తా)కు ఉత్తరాన, హుగ్లీ నదికి తూర్పు ఒడ్డున ఉంది – గంగా నదిని ఇక్కడి చుట్టుప్రక్కల ప్రాంతాలవారు ఈ పేరుతో పిలుస్తారు. దక్షిణేశ్వర్ అనే పేరు దగ్గర్లో దక్షిణ దిక్కు వైపు చూస్తున్న ప్రఖ్యాత కాళి దేవాలయం ద్వారా వచ్చింది. వాతావరణం చాలా వరకు వెచ్చగా మరియు తేమగా ఉంటుంది, కాని నవంబర్-ఫిబ్రవరిలో చల్లగా ఉంటుంది.

భారతదేశం అనేక సార్లు పర్యటించిన సమయంలో ఇక్కడే బస చేసిన శ్రీ శ్రీ దయామాతాజీ మరియు శ్రీ శ్రీ మృణాళినీమాతాజీల సాన్నిధ్యం వల్ల ఈ మఠం ఆశీర్వదించబడింది.

భక్తులు వ్యక్తిగత మరియు నిర్వహించబడే ఆధ్యాత్మిక రిట్రీట్స్ రెండింటికి ఆహ్వానితులు. ముందస్తు బుకింగ్‌ అవసరం. వ్యక్తిగత వ్యాపారం కోసం కోల్‌కతాకు వచ్చే భక్తులు ఆశ్రమం వెలుపల ఉండాలని సూచిస్తున్నాం, అయితే వారి వ్యాపార పనులు పూర్తి చేసిన తర్వాత సందర్శించడానికి లేదా వ్యక్తిగత రిట్రీట్ కోసం ఉండటానికి ఆహ్వానితులు.

కోల్‌కతాలో సందర్శించాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో 4 గర్పార్ రోడ్‌లోని గురుదేవుల ఇల్లు కూడా ఉంది. రెండవ అంతస్తు ఉన్న అటక ఆయన ప్రారంభ సాధన యొక్క ధ్యానాలు, కన్నీళ్లు మరియు తుఫానులకు సాక్షి. అంతరాయం కలిగిన హిమాలయాల ప్రయాణమప్పుడు, ఆ కిటికీ నుండి ఆయన ప్రయాణానికి అవసరమైన వస్తువులను కిందకు విసిరారు. తరువాత, మాస్టర్ మహాశయుల ప్రోత్సాహంతో, ఆయన ముందు జగన్మాత ప్రత్యక్షమై, “ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను! ఎప్పుడైనా నేను నిన్ను ప్రేమిస్తాను!” అని చెప్పే వరకు ఇక్కడే ధ్యానం చేశారు.

బాబాజీ 1920లో గురుదేవులను, వారి గదిలోనే కలిశారు. అమెరికాకు వెళ్ళే ముందు గురుదేవులు దైవ అనుమతి పొందాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రార్థించారు. బాబాజీ ఆయనకు ఇలా హామీ ఇచ్చారు, “పశ్చిమంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను ఎంచుకున్నదినిన్నే.” బాబాజీ దర్శనం పొందిన జూలై 25 – వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు బాబాజీ స్మృతి దినంగా జరుపుకుంటారు. ఈ మొదటి అంతస్తు గదిలో కొన్ని పాత కుటుంబ ఫోటోలు కూడా ఉన్నాయి. గురుదేవుల ఇంటిని ఆయన సోదరుడు సనంద లాల్ ఘోష్ వారసులు బాగా నిర్వహిస్తారు, వారు మర్యాదస్తులు మరియు భక్తులకు స్వాగతం పలికేవారు.

భట్టాచార్య లేన్‌లోని వై.ఎస్.ఎస్ గర్పార్ రోడ్ కేంద్రం, గురుదేవుల యవ్వనంలో ధ్యానం చేసిన చోటు, ఆయన చిన్ననాటి స్నేహితుడు తులసి బోస్ ఇంటి వెనుక ఉంది. ఇప్పటికీ ప్రతి శనివారం సాయంత్రం 4.30-7.00 గంటల వరకు ఇక్కడ ధ్యానం నిర్వహిస్తారు. గురుదేవుల తల్లిగారు మరణించిన చోటు 50 అమ్హరెస్ట్ వీధి. తరువాత, మాస్టర్ మహాశయులు చాలా సంవత్సరాలు ఇక్కడ నివసించారు. గురుదేవులు మరియు ఆయన సోదరుడు మాస్టర్ మహాశయులతో కలసి ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు వారి తల్లి దర్శనం అయ్యింది. నాగేంద్ర మఠంగా మార్చబడినప్పటి నుండి అప్పర్ సర్క్యులర్ రోడ్ (P.C. రోడ్)లోని భాదురీ మహాశయుల (గాలిలో తేలే సాధువు) ఇల్లు కూడా భక్తులకు తెరిచి ఉంటుంది.

శ్రీరాంపూర్ దక్షిణేశ్వర్ నుండి దాదాపు 20 కి.మీ.దూరంలో ఉంటుంది. గురుదేవుల కళాశాల సంవత్సరాలకు సంబంధించిన చాలా ప్రదేశాలు రాయ్ ఘాట్ సంధు (బ్యూరో బీబీ లేన్) వద్ద ఉన్న శ్రీ యుక్తేశ్వర్ గారి ఆశ్రమానికి దగ్గరగా ఉన్నాయి. పాత ఆశ్రమం ఉన్న ప్రదేశంలో స్మృతి మందిరం ఉంది. సమీపంలో గురుదేవులకు బాబాయిగారైన శారదా ప్రసాద్ ఘోష్ ఇల్లు ఉంది, ఆయన ఇక్కడ కొంతకాలం నివసించారు. గురుదేవుల బంధువు, ప్రభాస్ చంద్ర గోష్, గురుదేవుల గదిని పుణ్యక్షేత్రంగా మార్చారు మరియు దానికి ఆనందలోకం అని పేరు పెట్టారు.

‘ది హోలీ సైన్స్ (The Holy Science)’ గ్రంథం పూర్తి చేసిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారికి బాబాజీ దర్శనం ఇచ్చిన ప్రదేశం రాయ్ ఘాట్ (మర్రి చెట్టుతో సహా). గంగా నది వైపు కొన్ని నిమిషాల కాలినడక దూరంలో ఉంటుంది.

విద్యార్థుల వసతి కోసం ఏర్పాటైన పాంధీ వసతి గృహం గంగా నదికి దగ్గర మరియు రాయ్ ఘాట్ నుండి కొద్ది దూరంలో ఉంటుంది. పాత నిర్మాణం యొక్క కొన్ని భాగాలు ఇప్పటికీ ఉన్నాయి.

శ్రీ రాంపూర్ కళాశాల కూడా గంగానది ఒడ్డున కొంత దూరంలో ఉంటుంది. ఇక్కడే గురుదేవులు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కోసం చదివారు. ఒకరు కళాశాల భవనంలోకి వెళ్ళి, ఆయన చదివిన తరగతి గదుల్లోకి కూడా ప్రవేశించి చూడవచ్చు.

1855లో నిర్మించిన దక్షిణేశ్వర్ లోని ప్రసిద్ధ కాళీ మాత ఆలయం, మన ఆశ్రమానికి దాదాపు ఒక కి.మీ. దూరంలో ఉంది. తొమ్మిది స్పైర్‌ల దేవాలయ గర్భగుడిలో కాళీ మాత విగ్రహం పడుకున్న శివుని ఛాతీపై నిలబడి ఉన్న భవతారణిగా (ఎవరైతే తన భక్తులను ఉనికి యొక్క మహాసముద్రం మీదుగా తీసుకెళ్తుందో) దర్శనమిస్తుంది; రెండు విగ్రహాలను మెరుగు పెట్టిన వెండి తామర రేకులపై ఉంచారు.

ఈ దేవాలయంతో గురూజీకి ఉన్న సన్నిహిత అనుబంధం ఆయన ఆత్మకథలో చక్కగా వివరించబడింది. ఉదాహరణకు, ఒకసారి ఆయన తన పెద్ద సోదరి రోమా మరియు ఆమె భర్త సతీష్‌ని గుడికి తీసుకెళ్ళినప్పుడు, ఆయనకి దైవ దర్శనం కలిగింది. వాస్తవానికి, గురుదేవులు తరచుగా ఆలయాన్ని సందర్శించి, ముందుగా గుడి ముందు పోర్టికోలో, తరువాత శ్రీ రామకృష్ణ గదిలో, ఆపై శ్రీ రామకృష్ణ పరమహంస ప్రకాశం పొందిన పంచవటిలోని మర్రి చెట్టు కింద చాలా గంటలు ధ్యానం చేసేవారు. పంచవటిలో ధ్యానం చేస్తున్నప్పుడు గురుదేవులు సమాధిస్థితి అనుభవాన్ని పొందారు.

20 ఎకరాల దేవాలయ సముదాయంలో నది ముందు భాగంలో ఉన్న శివుడి యొక్క వివిధ అంశాలకు సంబంధించిన 12 మందిరాలు, రాధా-కృష్ణ దేవాలయం మరియు గంగానదిపై స్నాన ఘాట్ ఉన్నాయి. శ్రీ రామకృష్ణ పరమహంస ఉపయోగించిన వస్తువులతో ఉన్న గది ఉంటుంది. ఆయన తన చివరి 14 సంవత్సరాలు అక్కడే గడిపారు. పవిత్ర మాత శ్రీ శారదా దేవి నివసించిన మరో గది ఉంటుంది. బకుల్ తలా ఘాట్‌లో భైరవి బ్రాహ్మణి యోగేశ్వరి శ్రీరామకృష్ణులను ‘తంత్ర సాధన’లో తన శిష్యులుగా చేసుకున్నారు. బకుల్ తలాకు ఉత్తరాన పంచవటి అనే విశాలమైన ఖాళీ స్థలం ఉంది, ఇక్కడ శ్రీ రామకృష్ణ మార్గదర్శకత్వంలో బన్యన్, పీపాల్, వేప, అమలకి మరియు బిల్వా లేదా బెల్ అనే 5 చెట్లు నాటబడ్డాయి. ఇక్కడే శ్రీ తోతాపురి ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ పరమహంస 12 సంవత్సరాల పాటు సాధన చేశారు.

ఇక్కడ చెప్పబడిన ప్రదేశాలను మరియు బేలూరు మఠం, స్వామి వివేకానంద ఇల్లు మొదలైనవి సందర్శించడానికి ఆశ్రమంలోని సేవకులు, భక్తులకు సంతోషంగా సహాయం చేస్తారు.

ఇతరులతో పంచుకోండి